ప్రభుత్వ అధికార కార్యక్రమం లో మంత్రి తనయుడు అతిధిగా రావడం కృష్ణా జిల్లాలో హాట్ తైక్ అయింది. మచిలీ పట్నం ఆర్టీసీ డిపో డ్రైవింగ్ స్కూలులో 9 వ బ్యాచ్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అతిధిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.. కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) హాజరు అయ్యాడు. 8 వ బ్యాచ్లో శిక్షణ పొందిన 16 మందికి సర్టిఫికెట్లను కిట్టు అందించడం గమనార్హం.

 ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ ఎం వై దానం అతిథిగా హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేకపోవడంతో కిట్టు ను ఆహ్వానించినట్లు ఆర్టీసి అధికారులు చెప్తున్నారు.  గతంలో మచిలీపట్నం కార్పొరేషన్ అధికారులు సమీక్షకు కూడా కృష్ణ మూర్తి హాజరు కావడం వివాదాస్పదం అయింది. అధికారిక కార్యక్రమాలు కు మంత్రి నాని.. తన కుమారుడిని పంపడం పై చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp