ప‌లు టీవీ షోలు, రాజ‌కీయాల‌తో బిజీగా గ‌డిపే న‌గ‌రి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా కొద్ది సేపు క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా మారారు. త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణితో క‌లిసి క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ అంటూ కోర్టులోకి దిగి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఈ క‌బ‌డ్డీ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర్‌ల్ అవుతున్నాయి. రోజా జ‌న్మ‌దినాన్ని  పుర‌స్క‌రించుకొని రోజా ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌లు క్రీడాపోటీల‌ను నిర్వ‌హిస్తుంటారు.

ఇందులో భాగంగానే ఈ సంవ‌త్స‌రం కూడ న‌గ‌రి డిగ్రీ క‌ళాశాల‌ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ మీట్ నిర్వ‌హిస్తున్నారు.  ఈ రోజు నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు  జ‌రిగే స్పోర్ట్స్ మీట్ ను సోమ‌వారం రోజా దంపతులు ఆరంభం చేశారు. ప్రారంభించిన వెంట‌నే భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు క‌లిసి కాసేపు విద్యార్థుల‌తో క‌బ‌డ్డీ ఆడారు. వేర్వేరు గ్రూపులుగా విడిపోయి క‌బ‌డ్డీలో త‌ల‌ప‌డ్డారు. ఈ త‌రుణంలో క‌బ‌డ్డీ కూత పెడుతూ బ‌రిలోకి దిగిన రోజా ఫోటోలు, వీడియోలు వైర‌ల‌య్యాయి. రోజా సినిమాలు, రాజ‌కీయాలు, టీవీ షోలే కాకుండా క్రీడ‌లు కూడ ఆడుతుందని ప‌లువురు పోస్ట్‌లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: