ఆంధ్ర ప్రదేశ్  లోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభ‌మైంది. ఇక  బ‌ద్వేల్లోని బాల‌యోగి గురుకుల పాఠ‌శాల లో రెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. ముందుగా నియోజ‌క‌వ‌ర్గంలోని క‌ల‌శ పాడు ఓట్ల లెక్కింపు చేప‌ట్టారు. మొత్తం 11 రౌండ్ల లో ఓట్ల‌ను లెక్కిస్తున్నారు.

ఇక తొలి రౌండ్ పూర్త‌య్యే స‌రికి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ ఏకంగా 8790 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమెకు 10478 ఓట్లు వ‌చ్చాయి. ఇక బీజేపీ అభ్య‌ర్థి ప‌న‌తం సురేష్ కు 1688 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ క్యాండెట్ మేరిపోగు కమ‌ల‌మ్మ కు 580 ఓట్లు వ‌చ్చాయి. ఇక నోటాకు 342 వ‌చ్చాయి. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లో సైతం వైసీపీ దూకుడు చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: