బ‌ద్వేలు ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతోంది. వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి సుధ దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం ఆమె 25 వేల ఓట్ల లీడింగ్ లో ఉన్నార‌ని తెలుస్తోంది. మొద‌ట్నుంచి ఇక్క‌డ వైసీపీ హ‌వా ఊహించిన రీతినే సాగుతోంది. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశించిన విధంగా మెజార్టీ వ‌స్తుందో లేదో అన్న టెన్ష‌న్ లో ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌హించిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తో స‌హా ఇంకొంద‌రు ఉన్నారు. ఇక బీజేపీ లీడ‌ర్ ఆదినారాయ‌ణ రెడ్డి మంచి టెన్ష‌న్ లో ఉన్నారు. ఇక్క‌డ బీజేపీ గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మే అయినా క‌నీసం గ‌ట్టి పోటీ అయినా ఇస్తుంద‌ని ఆశించిన‌ప్ప‌టికీ అది కూడా జ‌ర‌గ‌లేదు. ఆదినారాయ‌ణ రెడ్డి హ‌వా ఉంద‌నుకున్న చోట కూడా వైసీపీనే ముందుంజ‌లో ఉంది. బ‌ద్వేలులో గెలుపు లేక‌పోయినా ఆశించిన రీతిలో ఓట్లు వ‌స్తే త్వ‌ర‌లో ఆయ‌న‌ను ఏపీ బీజేపీ చీఫ్ ను చేస్తార‌న్న వార్త‌లు కొన్ని వ‌చ్చాయి. తాజా ఫ‌లితాల నేప‌థ్యంలో అవేవీ సాధ్యం కావ‌నే తేలిపోతోంది. ముఖ్యంగా బ‌లమ‌యిన శ‌క్తిగా ఎదిగిన వైసీపీ తొలి నుంచి ఆదినారాయ‌ణ రెడ్డిని నిలువరించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ స‌ఫ‌లీకృతం అయ్యాయి. అదేవిధంగా జ‌గ‌న్ ప‌ట్టుద‌ల కూడా ఇక్క‌డ నెగ్గుకు వ‌చ్చింది. రెడ్డి వ‌ర్స‌స్ రెడ్డి అన్న విధంగా వార్ న‌డిచినా చివ‌రికి గెలిచేది జ‌గ‌నే అని తేలిపోయింది. ఇక బీజేపీ అధిష్టానం కోరుకున్న స్థాయిలో ఆంధ్రాలో నిల‌దొక్కుకోవ‌డం అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు జ‌ర‌గ‌ని ప‌ని.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp