బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు జెట్ రాకెట్ స్పీడ్ తో జ‌రుగుతోంది. మ‌రో వైపు తెలంగాణ లోని హుజూరా బాద్ లో ఓట్ల లెక్కింపు మాత్రం న‌త్త‌న‌డ‌క న సాగుతోంది. ఇప్ప‌టికి అక్క‌డ కేవ‌లం ఒక్క రౌండ్ ఓట్ల లెక్కింపు మాత్ర‌మే జ‌రిగింది. బ‌ద్వేల్లో మాత్రం ఇప్ప‌టికే నాలుగు రౌండ్లు పూర్త‌య్యాయి. వైసీపీ మెజార్టీ కూడా ఇప్ప‌టికే 30 వేలు దాటేసింది. ఇక రౌండ్ల వారీగా ఫ‌లితాలు, వైసీపీ మెజార్టీలు ఇలా ఉన్నాయి.

తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక మూడో రౌండ్‌ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యం వైసీపీకి ద‌క్కింది. నాలుగో రౌండ్‌ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ కొనసాగుతున్నారు. ఇక తుది ఫ‌లితం 12 గంట‌ల‌కే పూర్తి కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: