నిరుద్యోగులు ఎవ‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ సూచించారు. చిక్క‌డ‌ప‌ల్లి సెంట్ర‌ల్ లైబ్రరీని సంద‌ర్శించిన  సంజ‌య్ నిరుద్యోగుల‌తో మాట్లాడారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ ఉన్న నేప‌థ్యంలోనే సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి వెళ్లారు.  బండి సంజ‌య్ ఈ సంద‌ర్భంగా నిరుద్యోగుల‌తో మాట్లాడారు. ఎంతో మంది యువ‌త తెలంగాణ ఉద్య‌మం కోసం ఆత్మ‌బ‌లిదానం చేసుకుంద‌ని పేర్కొన్నారు. అప్పుడు రాష్ట్రం కోసం చేసుకుంటే.. ఇప్పుడు ఉద్యోగాల కోసం బ‌లిదానం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. అస‌లు నోటిఫికేష‌న్‌ల గురించి మాట్లాడ‌కు వెంట‌నే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని కేసీఆర్‌పై బండి ఫైర్ అయ్యారు.

రాజ‌కీయ ల‌బ్ది కోసం మేము ఉద్య‌మం చేయ‌డం లేదని, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఏమి మాట్లాడావ్ అని.. ఇప్పుడు ఏమి చేస్తున్నావ్ అని నిప్పులు చెరిగారు సంజ‌య్‌. నిరుద్యోగుల‌కు బీజేపీ అండ‌గా ఉంటుంద‌ని, ఎవ‌రు ఆత్మ‌హత్య‌లు చేసుకోవ‌ద్దు అని స్ప‌ష్టం చేశారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొని త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చ‌వ‌ద్ద‌న్నారు. ప‌క్క రాష్ట్రం ఏమి చేస్తున్న‌ది.. నువ్వు ఏమి చేస్తున్నావ్ చెప్పాల‌ని కేసీఆర్ ను నిల‌దీశారు. కేవ‌లం ప్ర‌గ‌తి భ‌వ‌న్, ఫార్మ్‌హౌస్‌లో ఉండ‌డానికి కాదు తెలంగాణ ముఖ్య‌మంత్రిని చేసింది అని మండిప‌డ్డారు. న‌వంబ‌ర్ 16న నిరుద్యోగ‌ల మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హిస్తాం అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: