బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఇన్ని రోజులు తనను క్షమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తనను జైలుకు పంపించాలంటూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. బండి సంజయ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఇన్ని రోజులు తనను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను సరే గొడవలు ఎందుకులే అని సైలెంట్ గా ఉన్నామని అన్నారాయన.

దమ్ముంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ తీసుకురావాలని ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటున్నారని ఇన్ని రోజులు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అనుకున్నామంటే కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతు చట్టాలపై పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతల మాటలు విని వరి పంట వేస్తే ఖచ్చితంగా నష్టపోతారని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: