జవాన్లపై జవాన్ కాల్పులకు దిగిన ఘటనలో ముగ్గురు వీర జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణ పక్కనే ఉన్న చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో చోటుచేసుకుంది. సుకుమా జిల్లా లోని మారాయి గూడెం లింగంపల్లి బేస్ క్యాంపులో దారుణం  చోటు చేసుకుంది. అయితే సోమవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది . వెంటనే ఛాతిష్ ఘడ్ పక్కనే ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన జవాన్లను హుటాహుటిన చేర్చారు . అదేవిధంగా చనిపోయిన వీర జవాన్ లను పోస్టుమార్టాన్ కోసం తరలించారు.



 అయితే అసలు విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతం లో కూడా ఈలాంటి ఘటనలు  సుకుమా జిల్లా , బీజాపూర్ పరిధిలో  జరిగిన దాఖలాలు చాల ఉన్నాయ్. ఛత్తీస్ ఘడ్ మరియు తెలంగాణ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు లకోసం కూంబింగ్ లను నిర్వహిస్తూ వుంటారు ఈ క్రమం లో వారికీ ప్రత్యేకమైన సెలవులు అంటూ ఏవి ఉండవు. అయితే ఈ క్రమంలోనే అనునిత్యం జరుగుతున్న కూబింగ్ ల కారణంగా విసుగుచెందుతున్నారు జవాన్ లు.  ఇలాంటి కారణం చేతనే  జవాన్ మిగతా జవాన్లపై కాల్పులకు తెగబడి ఉండవచ్చని తెలుస్తూవుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: