తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదివారం రాత్రి విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడిన వ్యాఖ్య‌ల‌కు ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండిసంజ‌య్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు నిప్పులు చెరిగారు బండి. తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ ద్రోహి అని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అని తిరిగారు.. తెలంగాణ‌కు రావాల్సిన వాటా 575 టీఎంసీలు అయితే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ 299 టీఎంసీల‌కు ఎందుకు సంత‌కం చేశారు అని ప్ర‌శ్నించారు.

కేవ‌లం ఒక్క‌సారి కాదు, నాలుగు సార్లు సంత‌కం చేశార‌ని గుర్తు చేశారు బండిసంజ‌య్‌. దేశంలో అగ్గి రాల్చుతడంట‌డా..?  యావ‌త్ తెలంగాణ ప్ర‌జానికాన్ని మోసం చేసింది కేసీఆర్ అని స్ప‌ష్టం చేసారు బండి సంజ‌య్‌. కేసీఆర్‌కు ఎన్ని లావాదేవీలు ముట్టాయో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజ‌య్‌. మ‌ద్యం అమ్ముతున్నారు. మ‌ర‌ల వాహ‌న‌దారుల నుంచి జ‌రిమానా వసూలు చేస్తున్నారు. మ‌ద్యం నిషేదిస్తే ఏమి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు కదా అని ప్ర‌శ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: