తెలంగాణ సీఎం కేసీఆర్‌పై  మ‌రొక సారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిప‌డ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడారు అని ఎద్దేవా చేశారు. సోమ‌వారం సీఎం మాట‌ల‌కు కౌంట‌ర్‌గా బండిసంజ‌య్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దేశంలో వ్యాట్ విధించే రాష్ట్రాల‌లో తెలంగాణ రెండ‌వ‌స్థానం, రాజ‌స్థాన్ మొద‌టి స్థానం అని తెలిపారు బండి సంజ‌య్‌.  
 
కేంద్ర‌ప్ర‌భుత్వం ఆగ‌స్టు 31 2021న లేఖ రాయ‌లేదా అని బండి ప్ర‌శ్నించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టంలో, రైతు రుణ‌మాఫీలో, అన్నింటిలో కేసీఆర్ అబ‌ద్దాలు ఆడ‌డంలోనే ఆయ‌న‌కు మించినోడు ఎవ‌డు లేడ‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్‌. దేశ‌వ్యాప్తంగా 24 రాష్ట్రాలు వ్యాట్‌ను త‌గ్గిస్తే తెలంగాణలో ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని పేర్కొన్నారు. నిన్న వ్యాట్ మేము పెంచ‌లేదు.. మేము త‌గ్గించ‌ము అన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. మ‌రి 2015లో4 శాతం వ్యాట్ విధించ‌లేదా అని ప్ర‌శ్నించారు. అబ‌ద్ధాల‌తో తెలంగాణ ద్రోహిగా త‌యారు అయ్యార‌ని నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: