ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప  ది రైజ్’.  అల్లుఅర్జున్‌ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని  ఉన్నాయి.  రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా.  మొద‌టి పార్ట్ ‘పుష్ప : ది రైజ్’ చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న‌ది. డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోకూడ ఈ సినిమా  విడుదల కానున్న‌ది. ఈ  నేప‌థ్యంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు.

ఇటీవల విడుదల చేసిన  ఈ చిత్రంలోని సునీల్, అనసూయ పాత్రల పరిచయానికి మంచి రెస్పాన్స్ వచ్చిన‌ది.  ప్రపంచ వ్యాప్తంగా  ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సుకుమార్‌ ప్ర‌క‌టించిన‌ సంగతి తెలిసిందే.  అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. అందులో భాగంగానే దుబాయ్ లో ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ను భారీ ఎత్తున  రంగం సిద్ధం చేస్తున్నారు. దానికి ముహూర్తం డిసెంబర్ 3న  నిర్ణయించారు. దుబాయ్ లో తెలుగు వారితో పాటు మలయాళీస్ ఎక్కువ సంఖ్యలో ఉండ‌నున్న నేప‌థ్యంలో.. బ‌న్నీకి మ‌లయాళంలో మంచి ఫాలోయింగ్ ఉండ‌డంతో బాగా క‌లిసి వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ది. ఈ చిత్రం ఏస్థాయిలో స‌క్సెస్ అందుకుంటుందో చూడాలంటే డిసెంబ‌ర్ 17 వ‌ర‌క వేచి చూడ‌క త‌ప్ప‌దు.




మరింత సమాచారం తెలుసుకోండి: