అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబెర్ రవి చనిపోయారు . స్వతహాగా కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ డివైస్ లు తయారు చేయడం లో దిట్ట అయినటువంటి టెక్ రవి చనిపోయినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ శనివారం ప్రకటించింది. అయితే రవి చనిపోయాడు అని గత కొంత కాలంగా వస్తున్నా వార్తలను ఈ కమిటీ ధ్రువీకరించింది. ఝార్ఖండ్ రాష్ట్రం లో ఓ మారుమూల ప్రాంతం లో అతడు చనిపోయినట్లు తెలిపారు. బాంబు లను పరీక్షించే క్రమంలో బాణం బాంబులను పరీక్షిస్తున్న ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లు కేంద్ర కమిటీ నివేదికలో వెల్లడించింది. 




అయితే ఈ వార్తలను ఝార్ఖండ్ పోలీసులు కూడా ధ్రువీకరించడం జరిగింది . మావోయిస్టు కేంద్ర కమిటీ టెక్ రవి కుటుంబానికి కూడా వార్తని అందించారు. రవి టెక్నీకల్ టీమ్ లో కీలక సభ్యులుగా ఉన్నారు. ఈయన ఎలక్ట్రానిక్ డివైస్ లు మరియు సాంకేతిక సమాచారాన్ని పంపడానికి సంబందించిన  విషయాలలో  కీలక సభ్యునిగా ఉన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: