హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ ఆసుప‌త్రి ప్రారంభోత్సవం ఆదివారం జ‌రిగిన‌ది.  ఈ ఆసుప‌త్రికి ప్రారంభోత్స‌వానికి ముఖ్యతిథులుగా తెలంగాణ ఆర్థిక‌, వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి,  ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ లు హాజ‌రు అయ్యారు. ఆసుప‌త్రిని ప్రారంభించిన మంత్రి, నేత‌లు వెళ్లిన కొద్ది సేప‌టికే లిప్ట్‌లో ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది.

ముఖ్యంగా హాస్పిట‌ల్ ప్రారంభోత్స‌వం త‌రువాత అక్క‌డ ఉన్న వైర్ ఒక్క‌సారిగా ప‌డింది. దీనికి తోడు లిప్ట్‌లో ప‌రిమితికి మించి జ‌నం ఉండ‌డంతో ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది.  అయితే ప్రమాద సమయంలో మాత్రం నేత‌లు ఎవ‌రు కూడ లిప్ట్‌లో లేరు. లిప్ట్‌లో ప్ర‌యాణిస్తున్న కొద్ది మందికి స్వ‌ల్ప గాయాలైనట్టు స‌మాచారం తెలుస్తోంది. కొన్ని చోట్ల అప్పుడప్పుడు ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. అదేమాధిరిగా ఈ ఆసుప‌త్రి వ‌ద్ద లిప్ట్ కూలి ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: