తెలంగాణాలో ధాన్యం కొనుగోలు అంశం అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ధాన్యం కొనుగోలుకి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉండి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం బాగా సంచలనం అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వరుస పర్యటనలకు రెడీ అయ్యారు. కాసేపట్లో జనగామ జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకునే అవకాశం ఉంది.

కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అక్కడి పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ధాన్యం కొనుగోలు పై  కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి  నిరసనగా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో  ధర్నాకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ నాయకులు. దేవరుప్పుల మండలం మనుపహాడ్, వనపర్తి గ్రామల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మొహరిస్తున్న నేపధ్యంలో భారీగా పోలీసులు మొహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: