మంగళవారం ఉదయం బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. సుశాంత్ బంధువు అయిన ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు వారి బంధువులందరూ హాజరయ్యారు. అంత్యక్రియలు ముగించుకుని మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు వచ్చేందుకు బయల్దేరారు. అయితే లఖిసరాయ్ జిల్లా వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడినది. ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడుతో సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయినది.
మంగళవారం ఉదయం బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. సుశాంత్ బంధువు అయిన ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు వారి బంధువులందరూ హాజరయ్యారు. అంత్యక్రియలు ముగించుకుని మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు వచ్చేందుకు బయల్దేరారు. అయితే లఖిసరాయ్ జిల్లా వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడినది. ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడుతో సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయినది.