అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసారు. ఆయ‌న‌కు చికిత్స కొన‌సాగుతున్న‌ద‌ని వివ‌రించారు. గ‌త కొద్ది రోజుల నుంచి ఇబ్బందుల‌కు గురికావ‌డంతో ఈనెల 20న అపోలో ఆసుప‌త్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. ప్ర‌స్తుతం కైకాల స్పృహ‌లోనే ఉన్నార‌ని, వైద్యానికి స‌హ‌క‌రిస్తున్నార‌ని వివ‌రించారు.

ఆసుప‌త్రికి తీసుకొచ్చిన స‌మ‌యంలో ఆరోగ్యం విష‌మంగా ఉండింద‌ని, ఇప్పుడు మాత్రం కొంచెం ప‌ర్వాలేద‌ని,  ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై చికిత్స‌ను అందిస్తున్నాం అని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.  ఇప్ప‌టికే పెరిగిన బీపీ కంట్రోల్‌లోకి వ‌చ్చింద‌ని, కిడ్నీల ప‌నితీరు మెరుగైంద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం కైకాల ఆరోగ్యం బాగానే ఉన్న‌ది, రోజు రోజుకు కాస్త మెరుగు ప‌డుతున్న‌ద‌ని స‌త్య‌నారాయ‌ణ కుమార్తె ర‌మాదేవి తెలిపింది. నాన్న గారి ఆరోగ్యంపై అస‌త్య ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని, నాన్న  కోలుకుంటున్నారని, ఇప్పుడిప్పుడే  ఆరోగ్యం కుదుట ప‌డుతుంద‌ని చెప్పారు ర‌మాదేవి.


మరింత సమాచారం తెలుసుకోండి: