తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ  ఔష‌దాల కుంభకోణంలో ఈడీ దూకుడును వేగ‌వంతంగా పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను  అటాచ్ చేసిన‌ట్టు ఈడీ అధికారులు వెల్ల‌డించారు.  ముఖ్యంగా ఇందులో 131 ఆస్తులు ఉన్నాయని వారు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులు, ప‌లు సెక్యూరిటీలు, ఎఫ్‌డీఐలు  మనీ లాండరింగ్ చ‌ట్టం కింద అటాచ్ చేసినట్లు వెల్ల‌డించారు.  ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్‌రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను జప్తు చేసినట్టు పేర్కొన్నారు. ఆస్తులే కాకుండా పెద్దమొత్తంలో నగదును కూడా ఈడీ ఫ్రీజ్ చేసిన‌ది.

ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో దేవికారాణి పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడింద‌ని ఈడీ అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు దొరికే పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలను రాబట్టినట్టు తెలుస్తున్న‌ది. దీంతో దేవికారాణికి సంబంధించిన రూ.6.28 కోట్ల విలువైన నగలను ఇప్ప‌టికే  స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ విచారణను చేపట్టింది. ఇందులో  మొత్తం ఏడు కేసులను ఏసీబీ నమోదు చేసిన‌ది. ఈఎస్ఐ స్కాం వల్ల ప్రభుత్వానికి రూ.211 కోట్ల నష్టం వాటిల్లింద‌ని అంచెనా వేసారు. అయితే  ఈకేసులో ఐదుగురు నిందితుల ఆస్తుల‌ను అటాచ్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు ఈడీ అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: