సిద్దిపేట మాజీ కలెక్టర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగ‌ళ‌వారం సంచలన ఆరోపణలు చేసారు. వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా  మ‌రియు మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు ,జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేసాడని ఆరోపించారు. డ‌బ్బులు వెంక‌ట్రామిరెడ్డి వ‌ద్ద ఉన్నాయి కాబ‌ట్టే ఎమ్మెల్సీ ప‌ద‌వీ క‌ట్ట‌బెట్టార‌ని ఫైర్ అయ్యారు జ‌గ్గారెడ్డి.

మెద‌క్ జిల్లా ఎమ్మెల్సీ అభ్య‌ర్థికి ఇన్‌చార్జీగా అత‌ను ప‌ని చేస్తున్నార‌ని.. వెంక‌ట్రామిరెడ్డి పాలు అమ్మి, క‌ష్ట‌ప‌డి కూలి చేసి డ‌బ్బులు సంపాదించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మెద‌క్ జిల్లా డ‌బ్బుల‌తోనే అత‌ను డ‌బ్బులు సంపాదించాడ‌ని.. ముఖ్యంగా అక్క‌డ డ‌బ్బులు తీసుకొని ఇక్క‌డ ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. భ‌విష్య‌త్‌లో వెంక‌ట్రామిరెడ్డి సంగ‌తి చూస్తాం అని జ‌గ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మెద‌క్ జిల్లాలో కాంగ్రెస్ ఓట్లు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా స్థానిక సంస్థ‌ల  ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా నిర్మ‌ల పోటీ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: