శాసనసభలో ఇటీవల చోటు చేసుకున్న మంత్రి కొడాలి నానికి, కొందరు ఎమ్మెల్యేలకు  ప్ర‌భుత్వం తాజాగా భద్రత పెంచింది. పౌరసరఫరాల మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రతను పెంచారు. కొడాలి భద్రతకు 17మంది ఉంటారు. కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని  రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

ఇక ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ లతో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రతను కల్పించింది. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదు రావ‌డంతో ఈ భ‌ద్ర‌త‌ను పెంచారు. అయితే ఫిర్యాదుల పరిశీలన అనంతరం వారి భద్రతను సమీక్షించిన‌ది కమిటీ. వారికి తక్షణం భద్రత కల్పించాల‌ని నిర్ణయం తీసుకున్న‌ది.  ఈరోజు నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు  ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించింది.  అయితే విశేష‌మేమిటంటే తమకు అధికారిక  ఎలాంటి సమాచారం లేదంటున్నారు ద్వారంపూడి, అంబటి రాంబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: