మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లును ఇవాళ‌ శాసనసభలో  రవాణాశాఖ మంత్రి పేర్నినాని ప్ర‌వేశ‌పెట్టారు. ముఖ్యంగా పర్యావరణం కోసమే పన్నులు పెంచుతున్నాం అని స్ప‌ష్టం చేసారు. పర్యావరణాన్ని రక్షించేందుకు , అధిక కర్బనాలను విడుదల చేసే పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు ఈ చట్ట సవరణ చేప‌ట్టిన‌ట్టు వివ‌రించారు. మోటారు వాహనాల పన్నులు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, గ్రీన్ ట్యాక్స్ పేరిట ఈ పన్నులు పెంచాలని నిర్ణయంచామ‌ని వెల్ల‌డించారు.

 ప‌దేండ్ల లోపు వాహనాలు, 12 ఏళ్లు మించిన వాహనాలు,  రవాణా, రవాణేతర వాహనాలు,  ఏడు నుంచి 10 ఏళ్లలోపు వాహనాలు 4 వేల రూపాయలు,  12 ఏళ్లు దాటితే 6 వేల రూపాయల గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం  తీసుకున్నాం. పర్యావరణ హితం కోసం గ్రీన్  ట్యాక్స్ ను అదనంగా విధించాలని నిర్ణ‌యించారు. నూతన వాహనాల విక్రయించినప్పుడు కూడా పన్నును పెంచుతూ, దాదాపు 20 లక్షల రూపాయల పైబడిన వాహనాలపై 18 శాతం వరకూ పన్ను  విధింపు ఉంటుందని, అదేవిధంగా  అదనంగా 4 శాతం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఐదు లక్షల లోపు ఉన్న వాహనాలకు 1 శాతం మాత్రమే పన్ను పెంపు, 10 లక్షలపైబడిన వాహనాలకు 3 శాతం పన్ను  అదనంగా విధించాలని  చట్టంలో మార్పులు చేసిన‌ట్టు మంత్రి నాని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: