ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుధ‌వారం రాయల  చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను బాబు పరిశీలించారు. చెరువు వ‌ద్ద నెల‌కొన్న‌ ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యుద్ధ ప్రాతిపదిక‌న పనులు పూర్తి చేయాలని అధికారుల‌ను కోరారు చంద్ర‌బాబు. మరమ్మతులు వేగవంతం చేయకుంటే.. ప్రమాదం జరిగే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు.  బాబు పర్యటన సందర్భంగా ఇక్కడ ఓ ఆసక్తికరమైన‌ సన్నివేశం చోటు చేసుకుంది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రబాబు కనిపించగానే లేచి నిల్చొని న‌మ‌స్కారం చేసారు.  చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారా లేదా అన్నది మాత్రం విజువల్స్‌లో సరిగ్గా కనిపించలేదు. ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నడుస్తోన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఈ న‌మ‌స్కారం దృశ్యం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: