తాజాగా మెఘాలయాలో మరొక రాజకీయ పరిణామం చోటు చేసుకొంది. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్పార్టీలో చేరారు. వీరందరూ మెఘాలయా మాజీ సీఎం ముకుల్ సంగ్మా సారథ్యంలో టీఎంసీలో చేరి షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రి టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది మెఘాలయాలో. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ముకుల్ సంగ్మాకాంగ్రెస్ పార్టీపై అసహనంతోనే ఉన్నారు. గత సెప్టెంబర్ లో మెఘాలయా రాష్ట్ర అధ్యక్షునిగా షిల్లాంగ్ లోక్సభ సభ్యుడు విన్సెంట్ హెచ్.పాల ను నియమించడంతో మాజీ ముఖ్యమంత్రి సంగ్మా కాంగ్రెస్ అధిష్టానం పై కోపంగా ఉన్నట్టు సమాచారం. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఊపును ఇస్తుంది. సొంత రాష్ట్రం కాకుండా మరొక రాష్ట్రంలోపాగా వేసేందుకు మెఘాలయ రాజకీయం కీలకంగా మారనున్నది.
తాజాగా మెఘాలయాలో మరొక రాజకీయ పరిణామం చోటు చేసుకొంది. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్పార్టీలో చేరారు. వీరందరూ మెఘాలయా మాజీ సీఎం ముకుల్ సంగ్మా సారథ్యంలో టీఎంసీలో చేరి షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రి టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది మెఘాలయాలో. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ముకుల్ సంగ్మాకాంగ్రెస్ పార్టీపై అసహనంతోనే ఉన్నారు. గత సెప్టెంబర్ లో మెఘాలయా రాష్ట్ర అధ్యక్షునిగా షిల్లాంగ్ లోక్సభ సభ్యుడు విన్సెంట్ హెచ్.పాల ను నియమించడంతో మాజీ ముఖ్యమంత్రి సంగ్మా కాంగ్రెస్ అధిష్టానం పై కోపంగా ఉన్నట్టు సమాచారం. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఊపును ఇస్తుంది. సొంత రాష్ట్రం కాకుండా మరొక రాష్ట్రంలోపాగా వేసేందుకు మెఘాలయ రాజకీయం కీలకంగా మారనున్నది.