డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు శ్రీనివాస్రెడ్డి. ఇటీవల పోచారం మనవరాలు వివాహం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో అంగరంగ వైభవంగ నిర్వహించడంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ హాజరయ్యారు. ఏపీ తెలంగాణ సీఎంలతో పాటు ఏపీ స్పీకర్ కాసేపు పోచారం శ్రీనివాస్రెడ్డితో పెళ్లిలో ముచ్చట కొనసాగించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు కూడా వివాహ వేడుకకు హాజరు అయ్యారు. తనకు కరోనా పాజిటివ్ సోకడంతో అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్లో ఉండాలని స్పీకర్ కోరారు. అయితే ఢ్యాన్స్ మాస్టర్ శివశంకర్ కూడా కరోనా బారీన పడి ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరోవైపు మాస్టర్ ఆరోగ్యం అంత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.