ముఖ్యంగా భూకంపం 22.77 డిగ్రీల అక్షాంశం, 93.23 డిగ్రీల రేఖాంశంలో తాకింది. మరోవైపు దాని లోతు 12 కిలోమీటర్లుగా లెక్కించారు. భూకంపం తీవ్రత 6.1, 26-11-2021న సంభవించినట్టు, ఐ.ఎస్.టి, లాట్: 22.77 మరియు పొడవు: 93.23, లోతు: 12 కి.మీ ,స్థానం: 73 కి.మీ ఎస్.ఇ. థెన్జ్వాల్, మిజోరాం ఇండియా అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్వీటర్ పేర్కొంది. మిజోరాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, అస్సాం అంతటా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు. ఇటీవల అస్సాంలోని గౌహతిలో నవంబర్ 20న 38 కిలోమీటర్ల పశ్చిమ నైరుతి ప్రాంతంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినది. ఈశాన్య భారతదేశం నిత్యం భూకంపానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతంగా మారుతోంది.
ముఖ్యంగా భూకంపం 22.77 డిగ్రీల అక్షాంశం, 93.23 డిగ్రీల రేఖాంశంలో తాకింది. మరోవైపు దాని లోతు 12 కిలోమీటర్లుగా లెక్కించారు. భూకంపం తీవ్రత 6.1, 26-11-2021న సంభవించినట్టు, ఐ.ఎస్.టి, లాట్: 22.77 మరియు పొడవు: 93.23, లోతు: 12 కి.మీ ,స్థానం: 73 కి.మీ ఎస్.ఇ. థెన్జ్వాల్, మిజోరాం ఇండియా అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్వీటర్ పేర్కొంది. మిజోరాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, అస్సాం అంతటా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు. ఇటీవల అస్సాంలోని గౌహతిలో నవంబర్ 20న 38 కిలోమీటర్ల పశ్చిమ నైరుతి ప్రాంతంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినది. ఈశాన్య భారతదేశం నిత్యం భూకంపానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతంగా మారుతోంది.