ఈశాన్య రాష్ట్రాల‌లో త‌రుచూ  భూకంపాలు సంభ‌విస్తూనే ఉన్నాయి. గ‌త ఐదారు రోజుల కింద‌టే భూమి కంపించిన విష‌యం విధిత‌మే. తాజాగా మిజోరాంలో ఇండో-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఆగ్నేయ‌దిశ‌గా 73 కిలోమీట‌ర్ల దూరంలో 6.1 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం శుక్రవారం భూకంపం గురించి వెల్ల‌డించిన‌ది.

ముఖ్యంగా భూకంపం 22.77 డిగ్రీల అక్షాంశం, 93.23  డిగ్రీల రేఖాంశంలో తాకింది. మరోవైపు దాని లోతు 12 కిలోమీటర్లుగా లెక్కించారు. భూకంపం తీవ్రత  6.1, 26-11-2021న సంభవించిన‌ట్టు,  ఐ.ఎస్.టి, లాట్: 22.77 మరియు పొడవు: 93.23, లోతు: 12 కి.మీ ,స్థానం: 73 కి.మీ ఎస్.ఇ. థెన్జ్వాల్, మిజోరాం ఇండియా అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్వీటర్ పేర్కొంది. మిజోరాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన‌ త్రిపుర, మణిపూర్, అస్సాం అంతటా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం మాత్రం  జరగలేదు. ఇటీవల అస్సాంలోని గౌహతిలో నవంబర్ 20న 38 కిలోమీటర్ల పశ్చిమ నైరుతి ప్రాంతంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిన‌ది. ఈశాన్య భారతదేశం నిత్యం భూకంపానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతంగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: