తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు వ్యవహారంపై మరొక‌సారి కేంద్రంతో  రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానున్న‌ది.  ఢిల్లీ కృషి భవన్ లో రాత్రి 7.30 గంటలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తో  రాష్ట్ర మంత్రుల బృందం సమావేశం అవ్వ‌నున్న‌ది. ముఖ్యంగా తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు ఈ భేటీలో హాజ‌రుకానున్నారు.
 
తెలంగాణలో ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ  స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మంత్రులు. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఇతర మంత్రులు, ఎంపీల‌ బృందం ప్రస్తావించిన అంశాలపై   కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్న‌ది. ఈరోజు రాత్రి భేటీ త‌రువాత ఓ క్లారీటీ రానున్న‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: