టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి ఇండిగో విమానంలో గ‌న్న‌వ‌రం ఎయిర్ ఫోర్ట్‌కు చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌ఫోర్ట్‌లో మోహ‌న్‌బాబుకు అభిమానులు పెద్దఎత్తున స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మోహ‌న్‌బాబు మాట్లాడారు.  ముఖ్యంగా నా విజ‌య‌వాడ‌కు నేను రావ‌డం నాకు ఎంతో సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు.

త‌న‌ ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు.   ఆ త‌రువాత ఎయిర్‌పోర్టు నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి కలెక్షన్ కింగ్ బయల్దేరి వెళ్లారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని  పరామర్శించనున్నారు మోహ‌న్‌బాబు. ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌రువాత ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసానికి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. ఇవాళ మోహ‌న్‌బాబు విజ‌య‌వాడ‌కు రావ‌డంతో  చూడ‌డానికి ప‌లువురు గుమికూడి ఎగ‌బ‌డి చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: