అరేబియా సముద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న‌ది. గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో రెండు విదేశీ కార్గో షిప్‌లు ఒకదానినొక‌టి  ఢీకొన్నట్లు రక్షణ శాఖ వెల్ల‌డించింది. ఈ ఘటనలో మాత్రం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ శాఖ తెలిపింది. అరేబియాలోని గ‌ల్ఫ్ ఆఫ్ క‌చ్‌లో శుక్రవారం రాత్రి ఎంవీఎస్ ఏవియేట‌ర్‌, అట్లాంటిక్ గ్రేస్ ఓడ‌లు ఒక‌దానికొక‌టి  ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఈ ఘటనలో చ‌మురు లీకేజీ చోటు చేసుకున్నట్టు పేర్కొంటున్నారు.

సమాచారం తెలుసుకున‌న‌  ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ షిప్‌లను మోహరించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నట్టు రక్షణ శాఖ తెలిపిన‌ది. అదేవిధంగా పొల్యూష‌న్ కంట్రోల్ నౌక‌ను కూడా అక్కడికి పంపించారు. ఢీకొన్న ఓడల ద్వారా ఏమైనా ర‌సాయనాలు కూడా స‌ముద్రంలో క‌లిసి ఉంటే ఈ నౌకతో శుభ్రంచేయనున్నారు. రక్షణ చర్యల కోసం కోస్ట్ గార్డ్స్ బృందంతో పాటు పెట్రోలింగ్ షిప్, హెలికాప్టర్‌ను కూడా మోహరించినట్లు రక్షణశాఖ వెల్ల‌డించింది.  ప్రస్తుతం ఓడల్లో ఉన్న‌ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని  వెల్లడించాయి అధికార వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: