దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు ఎయిర్ఫోర్ట్కు వచ్చిన ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. అధికారులు వీరిని వెంటనే బెంగళూరులోని ఓ ప్రయివేటు హోటల్లో క్వారంటైన్లోకి తరలించారు. ఒమిక్రాన్ వేరియంటేనా అనే అనుమానంతో నిర్థారణ కోసం శాంపిల్స్ను ముంబయి ల్యాబ్కు పంపారు. బెంగళూరులో కరోనా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒమిక్రాన్ వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వేరియంట్ మరొకసారి ప్రపంచాన్ని వణికిస్తోందని.. ఒమిక్రాన్ డెల్టావేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమైందని ఇప్పటికే నిపుణులు హెచ్చించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిక జారీ చేసినది. ఇవాళ ఉదయం ప్రధానిమోడీ కూడా ఈ వేరియంట్పై ప్రత్యేక సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు కూడా చేసారు.