అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకునేందుకు శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైన విషయం విధిత‌మే. తాజాగా క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కఠిన నిబంధనలతో భక్తులను యాత్రకు అనుమతిస్తున్నారు. శబరిమల యాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బంది రెండు టీకా డోసులు వేసుకోవడాన్ని ఇప్ప‌టికే కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసిన‌ది.  లేదంటే ఆర్టీ-పీసీఆర్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ చూపాలని స్పష్టం చేసిన‌ది.

ముఖ్యంగా చిన్న పిల్లల దర్శనం విషయంలో మాత్రం కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో ఇచ్చిన ఆంక్షలను సవరించి తాజాగా ఉత్తర్వులను జారీ చేసిన‌ది. అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాద‌ని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.  పిల్లలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదికను చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించింది కేర‌ళ ప్ర‌భుత్వం.  మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, పిల్లలను వారి వెంట ఉన్న పెద్దవారు ఎప్ప‌టిక‌ప్పుడూ పర్యవేక్షించాలని సూచించింది.

ముఖ్యంగా పెద్దలంద‌రికీ ఈ ఆంక్ష‌లు అమ‌లులోనే ఉంటాయ‌ని, ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌డానికి వారంద‌రూ టీకా సర్టిఫికెట్ లేదా ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే జీవో జారి చేసింది. మ‌రోవైపు కొత్త వేరియంట్ ప్ర‌మాదం ముంచుకువ‌స్తున్న త‌రుణంల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచ‌న‌లు కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: