ఇతర రాష్ట్రాలలో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పాలని పేర్కొన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని, ముడి బియ్యం కొంటాం అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారని గుర్తుకు చేసారు. వానాకాలంలో ఎలా పంటను కొంటున్నావో.. యాసంగిలో కూడా అదేవిధంగా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. ఇవాళ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు బండి సంజయ్.
కనీసం ప్రణాళిక లేదని, కేంద్ర ప్రభుత్వం కొనబోమని చెప్పినప్పుడూ రాష్ట్ర రైతులను నువ్వు సూచనలు ఇవ్వాలా వద్దా.. కొనుగోలు కేంద్రాలను ఎందుకు బంద్ చేస్తానంటున్నవ్.. తెలంగాణలో 5 రకాల విత్తనాలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి తెలంగాణ రైతులకు ఇస్తే.. కేంద్రం తప్పకుండా కొంటుంది. బాయిల్డ్ రైస్ మీద ప్రేమ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు. 7 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పావు.. మరీ బాయిల్డ్ రైస్ కాకుండా ఆ విత్తనాలను రైతులకు అందజేస్తే కేంద్రం కొంటుంది సమస్యే ఉండదు కదా అని పేర్కొన్నారు.