నిన్న సాయంత్రం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో సిరివెన్నెల అకాల మృతితో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఇవాళ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నివాళుల‌ర్పిస్తున్నారు. నిన్న సాయంత్రం ఇవాళ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు కిమ్స్ ఆసుప‌త్రిలోనే ఉంచారు ఆయ‌న పార్థివ దేహాన్ని. ఇవాళ ఉద‌యం ఫిల్మ్‌ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రూ సంద‌ర్శించేందుకు వీలుగా మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పార్థివ‌దేహాన్ని ఉంచారు.

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల స‌మ‌యంలో జూబ్లీ హిల్స్‌లో ఉన్న‌టువంటి మ‌హాప్ర‌స్థానం వ‌ద్ద సిరివెన్నెల అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం నుంచి సినీ ప్ర‌ముఖులు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి దంప‌తులు, ఎం.ఎం.కీర‌వాణి, సినీ న‌టులు బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, నిర్మాత అల్లుఅర‌వింద్‌, హీరో రానా, రావు ర‌మేష్ ప‌దాల సేక‌ర‌ణ‌లో అలుపెరుగ‌ని బాట‌సారి అయిన దిగ్గ‌జ పాట‌ల ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఉద‌యం నుంచి ఒక్కొక్క‌రుగా చేరుకొని ఫిల్మ్‌చాంబ‌ర్ వ‌ద్ద నివాళుల‌ర్పిస్తున్నారు.  సిరివెన్నెల కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తప‌రుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: