కర్నూలు జిల్లా శ్రీ‌శైలం స‌మీపంలోని న‌ల్ల‌మ‌ల ఫారెస్ట్ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం సంభ‌వించింది. స‌ద‌రూ యువ‌తి ప్ర‌ద‌ర్శించిన నిర్లక్ష్య‌మే చివ‌రికీ ఆమె ప్రానాల‌ను తీసుకున్న‌ది. కంటి రెప్ప‌పాటులోనే జ‌రిగాల్సిన ఘోరం జ‌రిగిన‌ది. బ‌స్సు ప్ర‌యాణంలో ఓ యువ‌తి అజాగ్ర‌త్త మూలంగా ప్రాణాల‌ను బ‌లితీసుకుంది.

ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్న ఓ యువ‌తి త‌ల బ‌య‌ట‌కు పెట్టి ఫారెస్ట్ ప‌రిశీలిస్తుంది. అదే ఆమెకు య‌మ‌పాశంలాగా ప్ర‌మాదం సంభ‌వించి చివ‌రి క్ష‌ణాలు అయ్యాయి. ఇదంతా సెక‌న్ల క్ష‌ణంలోనే జ‌రిగిపోయింది. బ‌స్సులో కిటికిలోంచి త‌ల‌ను బ‌య‌ట‌కు పెట్టి శ్రీ‌శైలం స‌మీపంలో ఉన్న‌టువంటి అడ‌విని తిల‌కిస్తుంది. ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌ర‌గరాని ఘోరం జ‌రిగిన‌ది. ఓ మ‌లుపు వ‌ద్ద‌కు చేరుకోగానే బ‌స్సుకు ఎదురుగా వ‌స్తున్న లారీ ఢీకొన‌డంతో యువ‌తి త‌ల‌కు తీవ్రంగా దెబ్బ‌ త‌గిలింది.

బ‌ల‌మైన గాయాలైన యువ‌తి అక్క‌డిక‌క్క‌డే  క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే ప్రాణాల‌ను కోల్పోయింది. వెంట‌నే ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ బ‌స్సును నిలిపివేసి పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేసారు. పోలీసుటు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని యువ‌తి మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఆ యువ‌తి  మృతిపై  కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: