ప్రేమ ఎంత బ‌ల‌మైన‌దో చెప్ప‌డానికి వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన వివాహ‌మే నిర‌ద్శ‌నం. వారిద్ద‌రీ వ‌య‌స్సూ 65 ఏండ్లే. వారికి ఒకరంటే మ‌రొక‌రికి గాఢ‌మైన ప్రేమ‌.కొన్ని అనివార్య కార‌ణాల మూలంగా ఆమెకు యుక్త వ‌య‌సులో మ‌రొక‌రితో పెండ్లి జ‌రిగింది. అయినా  ఆమె జ్ఞాపకాలతోనే అతడు ఒంటరిగానే గ‌డిపాడు. త‌న ప్రేయ‌సి దక్క‌లేద‌ని.. తన‌ను త‌ప్ప మ‌రెవ్వ‌రినీ వివాహం చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని, ఎవ్వ‌రికీ త‌న జీవితంలోకి చోటు క‌ల్పించ‌లేదు. చివ‌రికీ మ‌ళ్లీ వారి ప్రేమ చిగురించి 65 ఏండ్ల వ‌యసుల్లో వారిద్ద‌రూ ఒక‌టయ్యారు.

ఆ మ‌హిళ వివాహం చేసుకున్న త‌రువాత  కొద్ది  కాలం కింద‌ట ఆమె భ‌ర్త చ‌నిపోయాడు. ఆమెకు పిల్ల‌లు కూడా క‌లుగ‌లేదు.  వాళ్లిద్ద‌రూ త‌మ పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటూ వేరు వేరుగానే ఉంటూ వ‌చ్చారు. చివ‌ర‌కు స‌మాజాన్ని క‌ట్టుబాట్ల‌ను కాద‌ని.. వారు పెళ్లి చేసుకున్నారు. క‌ర్నాట‌క‌లోని మాండ్య జిల్లా మేలుకొటిలో నిన్న ఈ వివాహంజ‌రిగింది. మేలుకొటే నారాయ‌ణుడి ఆల‌యానికి ఎదురుగా ఉన్న ఆశ్ర‌మంలో మైసూర్ లోని హెబ్బాళ ప్రాంతంలో ఉన్న చిక్క‌ణ్ణ‌, అదే ప్రాంతానికి చెందిన జ‌యమ్మ‌లు 65 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లి చేసుకోవ‌డం అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. సంప్ర‌దాయం ప్ర‌కారం ఆమెకు అరుంధ‌తీ న‌క్ష‌త్రం కూడా చూపించారు. ఈ వ‌య‌స్సులో చేసుకున్న  పెళ్లి పోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎంతో వైర‌ల్‌గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: