తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురుపాలక శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్ చేసారు. తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించాలని ట్విట్ లో ప్రధాని మోడీని కోరారు.  పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్ట్ లకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని  కేటీఆర్ కోరారు.

తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని.. సీఎం కేసీఆర్ అనేక సార్లు కోరారని కేటీఆర్ గుర్తు చేసారు. డిసెంబ‌ర్‌ 6న జరగనున్న సమావేశంలో తెలంగాణ ప్రాజెక్ట్ లపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని కేటీఆర్ ప్రధాని మోడీని  కోరారు. గతంలో చాలా రోజుల నుంచి తెలంగాణలో ఉన్న  కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న‌ది.  తాజాగా  ఈ విషయాన్ని ట్విట్ట‌ర్‌ ద్వారా మరొక‌సారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: