ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గొప్ప ఆర్థికవేత్త అని, మేదావి అని కొనియాడారు సీనియర్ నాయకులు వీహెచ్. రోశయ్య ను ప్రశాంతంగా ముఖ్యమంత్రి పదవీ చేయకుండా హింసించారు అని వీహెచ్ గుర్తు చేసారు. రోషయ్యను అందరూ వినియోగించుకున్నారని, తనకు ప్రశాంతంగా పని చేసుకునివ్వలేదు అనే బాధ రోషయ్యకు ఉండేదని వెల్లడించారు సీనియర్ నాయకులు వీహెచ్.
రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని.. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ గాంధీభవన్ కు తప్పకుండా చేరుకునే వారు అని గుర్తు చేసారు. క్రీయాశీలక క్రమశిక్షణకు మారు పేరు రోశయ్య అనిచెప్పారు. నిజమైన కాంగ్రెస్ వాదీ కొణిజేటి రోశయ్య అని పేర్కొన్నారు వీహెచ్. రోశయ్య మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు సీనియర్ నేత వీహెచ్. కాంగ్రెస్ రోశయ్య లాంటి గొప్పనేతలు ఇప్పుడు ఎవరూ లేరు అని.. రోశయ్యను ఆదర్శంగా తీసుకోవాలని వీహెచ్ తెలిపారు.