ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిచ‌నున్న  చిత్రం ‘పుష్ప ది రైజ్’  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రీక‌రించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తున్న‌ది. అయితే విలన్ గా మలయాళ స్పెర్ స్టార్ ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని అంద‌రినీ ఈ సినిమాపై భారీ అంచెనాలు  రేకెత్తిస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను డిసెంబర్ 6 న  సాయంత్రం 6.03 నిమిషాల‌కు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందరూ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న క్షణంలో అక‌స్మాత్తుగా మూవీ మేకర్స్ షాక్ ఇచ్చారు.  కొన్ని టెక్నీకల్ ఇష్యూ మూలంగా ఇవాళ విడుద‌ల కావాల్సిన  ట్రైలర్ వాయిదా పడుతున్నట్టు ప్ర‌క‌టించారు.  ట్రైలర్ విడుద‌ల  చేయడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మేకర్స్ త్వరలోనే ట్రైలర్ విడుద‌ల  చేస్తామని  వెల్ల‌డించారు.  దీంతో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ పై  ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వాయిదా పడిందని చెప్పిన చిత్రబృందం మళ్లీ  విడుద‌ల ఎప్పుడు చేస్తారో చెప్పకపోయేసరికి ఇంకా ఫ్యాన్స్  మండిప‌డుతున్నారు.  మ‌రీ ఈ ట్రైలర్ ఎప్పుడు విడుద‌ల‌వుతుందో చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: