తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎప్పుడు క‌ష్టాల‌లో ఉన్నా చిత్ర ప‌రిశ్ర‌మ త‌న‌వంతుగా సాయం చేస్తూనే ఉంటుంది. ప్ర‌కృతి వైప‌రిత్యాల వ‌ల‌న ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో టాలీవుడ్ మొత్తం ఏక‌మై వారి కోసం అండ‌గా నిల‌బడుతుంటారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌ర‌ద‌ల కార‌ణంగా వేలాది కుటుంబాలు రోడ్డున ప‌డిన విష‌యం విధిత‌మే.

ముఖ్యంగా చిత్తూరు, క‌డ‌ప‌, నెల్లూరు, అనంత‌పురం జిల్లాల‌లో వ‌ర‌ద ధాటికి కొట్టుకుపోయి.. కొంత మంది మ‌ర‌ణించి.. ప‌శువులు, గేదెలు.. ఇలా ఒక్క‌టేమిటి అనేక విధాలుగా న‌ష్ట‌పోయారు ఏపీ ప్ర‌జ‌లు. ఈ విప‌త్తు కార‌ణంగా కోట్లాది రూపాయ‌ల న‌ష్టం క‌లిగింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం వారిని ఆదుకోవ‌డం కోసం సాయం చేయ‌డం ప్రారంభించింది.

ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా మేము సైతం అంటూ ప్ర‌భుత్వానికి అండ‌గా నిలుస్తున్నారు. తాజాగా యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌బాస్ త‌న‌వంతుగా సాయం కింద కోటి రూపాయ‌ల‌ను విరాళం అందించిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదివ‌ర‌కే ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోలు రూ.25ల‌క్ష‌ల చొప్పున అందించిన విష‌యం విధిత‌మే. ప్ర‌బాస్ కోటి రూపాయ‌లు అంద‌జేసిన ప్ర‌బాస్‌కు ఇదేమి కొత్త కాదు.. గ‌తంలో క‌రోనా స‌మ‌యంలో కూడా క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు ప్ర‌బాస్ త‌న‌వంతుగా రూ.4.5 కోట్లు విరాళంగా అందించాడు. ప్ర‌భాస్ గొప్ప మ‌న‌స్సుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మా డార్లింగ్ అంటే డార్లింగే అంటూ ప్ర‌భాస్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తున్నారు ఫ్యాన్స్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: