త‌మిళ‌నాడులోని  కూనూరు వ‌ద్ద నీల‌గిరి కొండ‌ల స‌మీపంలో ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్రమాదంపై  ర‌క్ష‌ణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్ర‌క‌టించారు.  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మికంగా మ‌ర‌ణించ‌డం  తీవ్ర వేదనకు గురిచేసింది అని ప్ర‌క‌టించారు ర‌క్ష‌ణ మంత్రి.  రావ‌త్‌ అకాల మరణం  భార‌త‌ సైనిక బలగాలకు, భార‌త‌దేశానికి తీరని లోటు అన్నారు.  జనరల్ రావత్ అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేసారు. మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్ మన సాయుధ దళాల ఉమ్మడి ప్రణాళికలను సిద్ధం చేసారు.

ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను  అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన విష‌యాన్ని ఆర్మీ చీఫ్ ద్వారా తెలుసుకున్న రాజ్‌నాథ్ సింగ్ వెంట‌నే ప్ర‌ధాని మోడీకి వెల్ల‌డించారు. ఆ త‌రువాత వెంట‌నే అత్య‌వ‌స‌ర క్యాబినెట్ భేటీ నిర్వ‌హించారు. క్యాబినెట్ భేటీ అనంత‌రం ర‌క్ష‌ణ‌మంత్రి బిపిన్ రావ‌త్ నివాసానికి చేరుకున్నారు. ఆ త‌రువాత హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై రేపు ప్ర‌క‌ట‌న చేస్తాను అని వెల్ల‌డించారు రాజ్‌నాథ్‌సింగ్‌. ఈ త‌రుణంలోనే బిపిన్ రావ‌త్ మృతి చెందిన‌ట్టు ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ప్ర‌క‌టించింది.      

మరింత సమాచారం తెలుసుకోండి: