ఇవాళ ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా  ఇవాళ ఒక్క‌రోజు ప‌వ‌న్ దీక్ష చేప‌ట్టి ముగించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైసీపీపై మండిప‌డ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్  కోసం పోరాడాల్సింది వైసీపీనే అని..  ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్ నినాదం చేసిన వైసీపీ ఇప్పుడు ఢిల్లీలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.  చేతగాని వాళ్లు మనకెందుకని ఎద్దేవా చేసారు.

ముఖ్యంగా త‌న సినిమాల‌ను ఆపి ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీసేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. అలాంటి బెదిరింపుల‌కు నేను అస‌లు భ‌య‌ప‌డ‌ను అని స్ప‌ష్టం చేసారు ప‌వ‌న్‌. పంతానికి దిగితే నా సినిమాల‌ను ఉచితంగా ఆడిస్తాన‌ని పేర్కొన్నారు. సినిమా టికెట్ల‌కు పార‌ద‌ర్శ‌క‌త లేదంటున్నారు. ప్ర‌భుత్వం అమ్మే మ‌ద్యానికి పార‌ద‌ర్శ‌క‌త ఉందా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: