భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స‌మాచారం చేర‌వేసారు. తొలి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే వెంట‌నే క‌రోనా ప‌రీక్ష చేయించుకున్న‌ట్టు ట్వీట్‌లో వెల్ల‌డించారు. నా రిపోర్టు పాజిటివ్‌గా వ‌చ్చింది. నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్య‌లు స‌ల‌హా మేర‌కు నేను క్వారంటైన్‌లో ఉన్నాను. త కొద్ది రోజులుగా నాతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రూ కూడా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.

బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కంటే ముందు కేంద్ర మంత్రి అజ‌య్ భ‌ట్‌కు కూడా క‌రోనా సోకింది. ఆ త‌రువాత అత‌ని ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అదేవిదంగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్‌బొమ్మైకి  కోవిడ్ పాజిటివ్ తేలింది. స్వ‌ల్పంగా క‌రోనా లక్ష‌ణాలు ఉండ‌డం.. పాజిటివ్ రిపోర్టు రావ‌డంతో అత‌డిని త‌న ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు క‌రోనా పాజిటివ్ సోక‌డంతో హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇలా క‌రోనా దేశ‌వ్యాప్తంగా అంద‌రినీ వెంటాడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: