గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆడిగొప్పలు వద్ద కారు అదుపు తప్పి సాగర్ కుడికాలవ లోకి దూసుకు వెళ్లింది. ఈ  కారులో మాచర్ల శాసన సభ్యుడు పిన్నెపల్లి రామకృష్ణా రెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి కుటుంబం ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారు అద్దాలు పగుల గొట్టి మదన్ మోహన్ రెడ్డిని రక్షించారు. ఆయన శ్రీ మతి, కుమారుడు, కుమార్తె సాగర్ లో గల్లంతయ్యారు. వీరు గుంటూరు వెళ్లి తిరిగి వస్తుండగా దుర్గి మండలం ఆడిగొప్పలు వద్ద ప్రమాదం సంభవించినంది. సమాచారం అందుకున్న ఎం.ఎల్.ఏ రామకృష్ణా రెడ్డి హుటాహుటిన ఆడిగొప్పుల వద్ద ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద క్రేన్ ను తీసుకు వచ్చి కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మాచర్ల శాసన సభ్యుడు పిన్నెపల్లి రామకృష్ణా రెడ్డి  ఘటనా  స్థలం వద్దే ఉండి  గాలింపు  చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు కష్టమైంది. దీంతో అధికారులు ప్రస్తుతం కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపి వేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: