భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్‌నియామకం జరిగిందా ? ప్రస్తుతం  ఇస్రో అధినేత గా ఉన్న శివన్ సేవలను మరో దఫా వినియోగించుకుంటారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరో మళయాళీ నియామకం జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరాయన ?
 అంతరిక్ష శాఖ కార్యదర్శిగా రాకెట్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ నియమితులైనట్లు సమాచారం. జనవరి 14తో పదవీకాలం ముగియనున్న కె శివన్ స్థానంలో సోమనాథ్ నియమితులయ్యారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్   డైరెక్టర్‌గా సోమనాథ్ పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కేరళకు చెందిన సోమనాథ్ కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో యూజీ డిగ్రీని, భారతదేశం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1985లో ఇస్రోలో చేరిన సోమనాథ్ వాహన రూపకల్పనకు విశేష కృషి చేశారు.కేరళ శాస్త్రవేత్తలు జి మాధవన్ నాయర్, డాక్టర్ కె రాధాకృష్ణన్ 2003 నుంచి 2014 వరకు అంతరిక్ష సంస్థకు నాయకత్వం వహించారు. సోమనాథ్ అగ్రస్థానానికి చేరుకున్న మూడవ మలయాళీ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: