భార‌త‌దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన‌టువంటి ముంబ‌యి న‌గ‌రంలో ఉన్న‌టువంటి భార‌త నౌక ద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ ర‌ణ్‌వీర్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర అగ్ని ప్ర‌మాదం సంభవించిన‌ది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు నేవీ సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రొక 11 మంది సిబ్బంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయితే గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను ముంబ‌యి నేవీ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌ను అందిస్తున్నారు. స‌మాచారం తెలుసుకున్న నేవీ, అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఫైర్ ఇంజిన్ సాయంతో అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి మాత్రం కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉన్న‌ది. అయితే పెద్ద‌గా న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఏమి లేద‌ని అధికారులు వెల్ల‌డించారు. అయితే ఐఎన్ఎస్ ర‌ణ్‌వీర్ తూర్పు నౌకాద‌ళ క‌మాండ్ వెల్ల‌డించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు భార‌త నౌకాద‌ళం ప్ర‌క‌టించిన‌ది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు. ఈ షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల జ‌రిగిందా.. లేక మ‌రేదైనా కార‌ణంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించిందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ముంబయిలోని భార‌త నౌక ద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ ర‌ణ్‌వీర్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో అంద‌రూ భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: