శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్‌పై కాల్పుల ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా  రామచంద్రాపురం సర్పంచ్‌ వెంకట రమణపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రామచంద్రాపురం సర్పంచ్‌ వెంకట రమణ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రామచంద్రాపురం సర్పంచ్‌ వెంకట రమణను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


గార మండలం రామచంద్రాపురం సర్పంచ్‌గా వెంకట రమణ ఉన్నారు. రామచంద్రాపురం సర్పంచ్‌ వెంకట రమణపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. అక్కడ  రెండు బుల్లెట్లు లభ్యం అయ్యాయి. ఈ కాల్పులకు వ్యక్తిగత కక్షలు కారణమా.. రాజకీయ విబేధాలు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన రామచంద్రపురం సర్పంచ్‌ వెంకట రమణ ను విచారిస్తే కానీ.. అదనపు సమాచారం వచ్చే అవకాశం లేదు. ఆయన కోలుకున్న తర్వాత విచారించి దుండగులను గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: