టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం పుల్ స్వింగ్‌లో దూసుకెళ్లుతూ ఉన్నారు. రెండేండ్ల క్రితం వ‌ర‌కు వ‌రుస ప్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ర‌వితేజ క్రాక్ ఇచ్చిన స‌క్సెస్‌తో ఇప్పుడు వ‌రుస సినిమాలైన‌ప్ సెట్ చేసుకుంటూ దూసుకెళ్లుతున్నాడు. ఈ త‌రుణంలోనే మాస్ మ‌హారాజా త‌ల్లిపై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు కావ‌డంపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ర‌వితేజ త‌ల్లి భూప‌తి రాజ్య‌ల‌క్ష్మితో పాటు మ‌ర్రిపాక‌కు చెందిన సంజయ్ అనే వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేసారు.

తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట మండ‌లం రామ‌వ‌రం వ‌ద్ద ఉన్న స‌ర్వే నెంబ‌ర్ 108, 124 పుష్క‌ర కాలువ, సూయిజ్  నిర్మాణ ప‌నుల‌ను భూప‌తి రాజ్య‌ల‌క్ష్మితో పాటు మ‌ర్రిపాక‌కు చెందిన సంజ‌య్ అనే వ్య‌క్తి ధ్వంసం చేసారంటూ.. పోలీసులు కేసు న‌మోదు చేసారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అధికారుల అనుమ‌తి లేకుండా ధ్వంసం చేసినందుకే కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. ఇక‌పోతే తూర్పు గోదావ‌రి జిల్లాలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ర‌వితేజ త‌ల్లి పై కేసు న‌మోదు ప‌ట్ల ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: