ప‌ద్మ పుర‌స్కార విజేత‌ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.త‌న త‌ర‌ఫున విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు అందించి, త‌న సందేశాన్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేశారు.తెలంగాణ నుంచి ముగ్గురికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి ఈ సారి ప‌ద్మ పుర‌స్కారాలు వ‌రించాయి. తెలుగు వారి ప్ర‌తినిధులుగా ప్రాంతీయ భేదాల‌కు అతీతంగా వారిని గుర్తించి గౌర‌వించే సంస్కృతిలో భాగంగా ఇరు ప్ర‌భుత్వాల పెద్ద‌లూ ఇవాళ త‌మ ఆనందాల‌ను వ్య‌క్తం చేస్తూ సామాన్యుల త‌ర‌ఫున ద‌క్కిన ప‌ద్మ పుర‌స్కారాల గౌర‌వాన్ని మ‌రింత ఇనుమ‌డింప‌జేయాల‌ని భావిస్తున్నారు.

కేసీఆర్ ఏమ‌న్నారంటే...
జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం అందించే 'పద్మ' అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల కు దక్కడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ అవార్డ్ ను సంయుక్తంగా దక్కించుకున్న భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు శ్రీ కృష్ణ ఎల్లా మరియు శ్రీమతి సుచిత్ర ఎల్లా, ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్న శ్రీ దర్శనం మొగిలయ్య, శ్రీ రామచంద్రయ్య, శ్రీమతి పద్మజ రెడ్డి లను సీఎం అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: