ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగ‌మూరు శ్రీ‌ధ‌ర్ కృష్ణారెడ్డి క‌న్నుమూసారు. ఏడాది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ అన‌గా మంగ‌ళ‌వారం ఆయ‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌లో శ్రీ‌ధ‌ర్ కృష్ణారెడ్డి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెల్లూరు జిల్లా తెలుగు యువ‌త అధ్య‌క్షుడిగా, నెల్లూరు న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడిగా  ప‌ని చేశారు.

ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి అనీల్ యాద‌వ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిథ్యం వ‌హిస్తూ ఉన్నారు. ఆ త‌రువాత మంత్రి అయ్యారు. 2009లో అనీల్ యాద‌వ్‌పై 90 ఓట్ల మెజార్టీతో ముంగ‌మూరు శ్రీ‌ధ‌ర్ కృష్ణారెడ్డి అనిల్‌పై 19వేల మెజార్టీతో ఓడిపోయారు. 2009లో స్థానం  నుంచి పొంగూరు నారాయ‌ణ టీడీపీ త‌రుపున పోటీ చేశారు. శ్రీ‌ధ‌ర్  కృష్ణారెడ్డి మృతి ప‌ట్ల ప‌లువురు టీడీపీ నేత‌లు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: