చైనా.. మన ఇండియాకు ఇది పక్కలో బల్లెం లాంటింది.. ఎప్పుడూ ఏదోలా ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. సరిహద్దు వివాదాల కారణంగా చైనా, ఇండియా మధ్య  అంత సుహృద్భావ వాతవరణం ఏమీ కనిపించదు. కొన్నాళ్ల క్రితం గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వివాదాన్ని మళ్లీ చైనా తెరపైకి తెచ్చింది.
 

అసలేం జరిగిందంటే.. గల్వాన్‌ ఘర్షణల్లో గాయపడిన పీఎల్‌ఏ కమాండర్‌ను వింటర్  ఒలింపిక్స్‌ టార్చ్‌బేరర్‌గా బీజింగ్ ఎంపిక చేసింది. దీన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. పీఎల్‌ఏ  షింఝియాంగ్‌ మిలిటరీ కమాండ్‌  రెజిమెంటల్‌ కమాండర్‌ చిబావోను ఒలింపిక్స్‌ టార్చ్‌బేరర్‌గా చైనా మొదట ఎంపిక చేసింది. అయితే.. 2020 జూన్‌లో భారత్‌పై దాడి జరిపిన సైనిక కమాండ్‌లో ఉన్న కమాండర్‌ను ఇప్పటికే బీజింగ్‌ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా నియమించారు. అయితే.. ఇది సిగ్గుచేటని అమెరికా సెనెట్‌ విదేశీ సంబంధాల కమిటీ సభ్యుడు విమర్శిస్తున్నారు. ముస్లిం మైనార్టీలపై మోడీ సర్కారు మారణహోమం నిర్వహిస్తోందన్నారాయన.


మరింత సమాచారం తెలుసుకోండి: