అవన్నీ ఖరీదైన కార్లు.. పార్కింగ్‌లో పెట్టారు. అనుకోకుండా వాటికి నిప్పు అంటుకుంది.. ఒకదాని పక్కన మరొకటి ఉండటంతో మంటలు ఒక కారు నుంచి మరో కారుకు అంటుకున్నాయి. అలా ఒకదాని మంటలతో మరొకటి తగలబడి పోయాయి.. ఇలా మొత్తం నాలుగు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. పార్కింగ్‌లో నిక్షేపంగా ఉంచిన కార్లు కాలి బూడిద కావడంతో కార్ల యజమానులు లబోదిబోమంటున్నారు.


ఈ ఘటన హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో జరిగింది. పార్కింగ్‌లో నిలిపిన నాలుగు కార్లు దగ్ధమైపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఇలా అనుకోకుండా దగ్ధమైన కార్లలో ఖరీదైన రేంజ్ రోవర్ కారుతో పాటు మరో మూడు ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మంటలకు కారణం ఏంటి.. ఇది ఎవరైనా కావాలని చేశారా.. లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అన్న విషయం దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు చెక్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: