తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్‌ పై తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి శ్రీనివాస గౌడ్‌ హత్యకు కుట్ర పన్నారన్న కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస గౌడ్ హత్యకు రూ. 17 కోట్ల సుపారీ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అయితే. ఈ అంశంపై తాజా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాస్ రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు కూడా చూడవని.. ఆయన్ను ఎవరు చంపుతారని.. ఆయన్ను చంపేందుకు రూ. 17 కోట్లు ఎందుకు ఇస్తారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను చంపడానికి సుపారీ ఇచ్చేంత సీన్‌ లేదని రేవంత్ అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీనివాస గౌడ్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తిపై అలా చిల్లరగా కామెంట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: